అంబర్పేట : యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం తన ఉంగరాన్ని ఇస్తానని బాగ్అంబర్పేటకు చెందిన ఐదేండ్ల సంవిత్ వీర్ అనే బాలుడు ముందుకొచ్చాడు. సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ మహత్కార్యానికి నేను సైతం ముందుంటా…నా చేతి వేలి ఉంగరం స్వామికి సమర్పిస్తానంటున్నాడు.
వివరాలు.. బాగ్అంబర్పేటకు చెందిన శ్వేత, సునీల్వీర్ల ఐదేండ్ల కుమారుడు సంవిత్ వీర్కు చిన్నప్పటి నుంచి నరసిం హస్వామి అంటే చాలా ఇష్టం. ఇటీవల సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట సందర్శించినప్పుడు వృత్తిరీత్యా మీడియాలో పని చేస్తున్న ఆ బాలుడి తండ్రి సునీల్వీర్ కవరేజ్ కోసం వెళ్లాడు. వచ్చిన తరువాత యాదాద్రి విశేషాలను తండ్రి బాలుడికి వివరించాడు.
ఇది విన్న తరువాత సంవిత్ వీర్ తనంతట తనే గుడికి తన వంతు సహాయంగా తనకు వచ్చిన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని కేసీఆర్ తాతకు చెప్తానని వీడియో చిత్రీకరించి న్యూస్ గ్రూపులో పోస్ట్ చేశాడు. అతను స్వయంగా సీఎం కేసీఆర్ను కలిసి ఉంగరాన్ని అందజేయాలని కోరుకుంటున్నాడు.