కందుకూరు : బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి తెచ్చింది సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో గల సామ నర్సింహరెడ్డి ఫంక్షన్ హలులో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన సంస్కృతి, పాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు చాటి చెప్పే పండుగలను ప్రజలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు.
ప్రజలు ఎంతో సంతోషంగా పండుగలను జరుపుకోవాలని అనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. అందులో భాగంగానే పేద మహిళలు సైతం బతుకమ్మను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర పండుగ బతుకమ్మను ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఏడాది కోటి 8లక్షల చీరెలను 333కోట్ల రూపాయల ఖర్చుతో పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్,వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి,సర్పంచ్లు సాధ మల్లారెడ్డి, యాలాల శ్రీనివాస్, జంగిలి పరంజ్యోతి, ఎరబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి వివిధ గ్రామాల మహిళలు పాల్గొన్నారు.