‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు అతని దృష్టి మెగాస్టార్ చిరంజీవిపై మళ్లింది. చిరంజీవి కోసం ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి తెలిపారు. చిరంజీవితో సినిమా చేయాలనే తన కోరిక ఈ నాటిది కాదని, ఆ స్థాయికి చేరేందుకు ఒక్కొక్క మెట్టునూ తానే నిర్మించుకుంటూ వెళ్తున్నానని, త్వరలోనే మెగాస్టార్ని కలిసి కథ వినిపిస్తానని వెంకీ అట్లూరి అన్నారు.
దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మేకింగ్ ైస్టెల్ని వెంకీ అట్లూరి ఏర్పరచుకున్నారు. యువతరంలోనే కాక, అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఇష్టుడైన దర్శకుడిగా ఎదిగారాయన. ఇప్పుడు ఆయన చిరంజీవి కోసం థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్నారనే మాట బయటకు రాగానే, ఈ కాంబినేషన్పై ఆడియన్స్లో ఆసక్తి మొదలైంది. అన్ని కుదిరితే త్వరలోనే చిరు-వెంకీ అట్లూరి కాంబినేషన్లో సినిమా రావచ్చు.