కందుకూరు : మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని 380 డ్వాక్రా గ్రూపులకు ఈ ఆర్ధిక పంవత్పరం నుంచి వచ్చే సంవత్సరం మార్చివరకు 39కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలను చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా 15కోట్ల 83లక్షల రూపాయలను మంజూరు చేశారు. అట్టి చెక్కును మంత్రి చేతుల మీదుగా మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. బ్యాంకుల ద్వారా రుణాలను పొందిన మహిళలు చిరు వ్యాపారాలు చేసుకొని స్వంతంగా తమ కాళ్లపై నిలబడాలని తెలిపారు. మహిళలు ఆత్మస్థెర్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, డీఆర్డీఎ పీడీ ప్రభాకర్, ఎంపీడీ జంగారెడ్డి, డీపీఎం బాల్రాజ్, ఎపీఎం కవిత, వైఎస్ ఎంపీపీ శమంత ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి,మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, ఎంపీడీఓ క్రిష్ణకుమారి వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు,ప్రజాప్రతినిధులు నాయకులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.