మియాపూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద యువతుల పెండ్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ఈ పథకం ద్వారా పేదల ఇండ్లలో కల్యాణ కాంతులు నెలకొంటున్నాయని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కరోనా సహా ఇతర ఎన్ని విపత్కర పరిస్థితులు నెలకొన్నా ప్రజా సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ముందుకే నడిపించిందన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా 29 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూ రైన రూ. 29,03,364 ఆర్థిక సాయాన్ని కార్పొరేటర్లు మాధవరం రోజాదేవిరంగారావు , దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం తన నివాసంలో లబ్దిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు కేరాఫ్గా తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న దన్నారు. పేద కుటుంబాలకు పెద్ద దిక్కులా పేద యువతులకు పెద్దన్నలా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు వారి కుటుంబాలలో సంతోషాలు నింపుతున్నాయని విప్ గాంధీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, సమ్మారెడ్డి, అనీల్రెడ్డి, భద్రయ్య, కార్తీక్రావు తదితరులు పాల్గొన్నారు.