తెలుగుయూనివర్సిటీ : సెంట్రల్ పూల్లో ఏదైనా పాత బియ్యం అమోదించే అవకాశాన్ని తనిఖీచేసి నిర్ణయించడానికి మిశ్రమ సూచిక పద్దతి అనే ఒక కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి) ప్రవేశపెట్టబడిందని భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ దీపక్శర్మ వెల్లడించారు. భారత ప్రభుత్వ ఆహార సంస్థ కొత్త నియమావళి గురించి దీపక్ శర్మ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
భారత ప్రభుత్వ విధానం ప్రకారం సెంట్రల్ పూల్లో కస్టమ్ మిల్డ్ రైస్ (సిఎంఆర్) ఆమోదం రాష్ట్ర ప్రభుత్వ ఏజన్సీలు, రైస్ మిల్లర్ల నుండి జిఓఐ నిర్థేశించిన స్పెసిఫికేషన్ల ప్రకారం జరుగుతుందన్నారు. సిఎంఆర్ విధానం ప్రకారం సెంట్రల్ పూల్ కింద సేకరించిన, మిల్లర్లనుంచి సేకరించిన ముడి బియ్యాన్ని అంగీకరించే సమయంలో ముడి పాత బియ్యం నిల్వల వయస్సు ఇక నుండి మిశ్రమ సూచిక పద్దతి ద్వారా పరీక్షించబడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ పరీక్ష తరువాత ఆకుపచ్చ, అవకాడో అకుపచ్చ వచ్చే నమూనాలను మాత్రమే ఆమోదించాలని సూచించారు. బియ్యం ఇతర రంగు అంటే పసుపు, నారింజ రంగు వంటిస్టాక్ను మిల్లింగ్ చేయబడలేదని తెలుపుతూ తిరస్కరింప బడుతుందన్నారు. ఈ పరీక్షా పద్దతి పాత బియ్యం నిల్వను ఆమోదించే అవకాశాన్ని రద్దు చేస్తుందని శర్మ చెప్పారు.
వాటాదారులకు ఈ పద్దతి గురించి ప్రత్యక్ష జ్ఞానం ఉండేల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్లతో ఈ పద్దతి ఆచరణాత్మక ప్రదర్శనల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మిల్లర్లు, వాటాదారులు ఈ కొత్త నియమావళి గురించి తెలుసుకొని దాని అమలుకు సహకరించాలని ఆయన అభ్యర్థించారు.