చర్లపల్లి , ఆగస్టు: చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ నుంచి దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుతుండటంతో స్పీడ్బ్రెకర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. శనివారం జమ్మిగడ్డ ప్రధాన రహదారిని ఆక్సిడెంట్జోన్గా గుర్తించి స్పీడ్బ్రెకర్లు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకు పెరుగిపొతున్న ట్రాఫిక్తో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే స్పీడ్బ్రెకర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రధాన రహదారిని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.విధిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి డివిజన్ పరిధిలోని కాలనీవాసులు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకొవాలని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు.