మియాపూర్ : వివేకానందుడి 157 వ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి బుధవారం విప్ ఆరెకపూడి గాంధీ వివేకానందుడి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని, యువత సన్మార్గంలో నడిచేలా దారి చూపారని పేర్కొన్నారు. శాంతి సహనంతో ఎలా ముందుకు నడవాలో , యువత దేశ పురోగతిలో ఎంత కీలకమో వివేకానందుడు విలువైన బోధనలను చేశాడన్నారు.
ప్రతీ ఒక్కరు ఆయన చూపిన బాటలో పయనించాలని విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు,పార్టీ నేతలు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.