ఎర్రగడ్డ : బోరబండ డివిజన్లో రూ.90 లక్షల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఇందులో వీకర్సెక్షన్లో రూ.62 లక్షలతో నిర్మించిన ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్, దేవయ్య బస్తీలో రూ.28 లక్షల వ్యయంతో డా.అంబేద్కర్ కమ్యూనిటీహాల్ భవనంపై అదనపు అంతస్తు నిర్మాణం ఉన్నాయి.
అంతకు ముందు డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి కిషన్రెడ్డి, గోపీనాథ్లు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బిజేపీ నాయకులు ఎన్.గౌతంరావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమోహన్, బీజేపీ అధ్యక్షుడు కొత్త వెంకటేష్, పార్టీల నేతలు ఎన్.విజయకుమార్, జి.లక్ష్మణ్గౌడ్, రమేష్యాదవ్, లక్ష్మణ్, డేవిడ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేష్, అధికారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.