బడంగ్పేట: స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్రిష్ణమోహన్రెడ్డి ఉత్తమ కమిషనర్గా అవార్డు అందుకున్నారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా క్రిష్ణమోహన్రెడ్డి అవార్డు అందుకున్నారు. క్రిష్ణ మోహన్రెడ్డి గతంలో రెండు జాతీయ పురస్కారాలు, మూడు రాష్ట్ర పురస్కారాలు అందుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికి ఐదు అవార్డులు అందుకున్నారు. క్రిష్ణ మోహన్రెడ్డి ఎక్కడ పనిచేసిన మంచి ఫలితాలు తీసుకువస్తుండడంతో ప్రభుత్వాలు ఆయనను గుర్తించి ఉత్తమ కమిషనర్గా అవార్డులు అందజేస్తున్నాయి. ఈ సందర్భంగా క్రిష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అవార్డులు ఇచ్చి మరింత బాద్యతను పెంచిందన్నారు. బాధ్యత యుతంగా పనిచేయడం వల్లే ప్రభుత్వం తనను గుర్తించి అవార్డులు ఇస్తుందని అన్నారు. జీవితంలో ఇలాంటి పురస్కారాలు తీపి గుర్తులుగా ఉంటాయన్నారు.