బండ్లగూడ : ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని, రాష్ట్రంలో అతి పెద్ద వైద్య పరికరాల పార్కును నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం బండ్ల గూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్లో పూర్ణిమ, రామం ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని ఆయన ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన ఆవరణలో మొక్కలు నాటారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్లో విడి భాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశానికి సేవ చేయలనే లక్ష్యంతో తను ఉద్యోగం వదిలేసి వచ్చినట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్శించేల భారత దేశం ఎదిగిందన్నారు.
ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన 1987 స్థాపించినప్పటి నుంచి సమాజానికి ఎంతో సేవలందించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రాసాద్ సంస్థ వ్యవస్థాపకుడు జీఎన్ రావు, స్థానిక మేయర్ మహేందర్గౌడ్ తదితరులు ఉన్నారు.