మెహిదీపట్నం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పశుసంవర్థక,సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్కు చెందిన ఓ లబ్దిదారుడికి 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు.
ఈ మేరకు తన కార్యాలయంలో నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్తో కలిసి అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ,ధరమ్సింగ్,మెట్టునట్రాజ్ తదితరులు పాల్గొన్నారు.