గద్వాలటౌన్, ఏప్రిల్ 24 : ఈనెల 25వ తేదీ నుంచి వ చ్చేనెల 2వ తేదీ వరకు నిర్వహించే ఓపెన్ స్కూల్ పరీక్షలకు గానూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పదో తరగ తి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు జిల్లా కేంద్రం లో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను అధికారులు పర్యవేక్షించారు. బుధవారం నెంబరింగ్ విధానా న్ని పూర్తి చేశారు. అలాగే ఆయా కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యా లు కల్పించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేశారు.
పరీక్షలకు జిల్లా కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 607మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల పర్యవేక్షణ నిమిత్తం ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు 35మంది, ఒక ఫ్లయింగ్ స్కాడ్, ఇద్దరు సిట్టింగ్ స్వాడ్స్, అలాగే ఏఎన్ఎంలను నియమించారు.
ఇంటర్లో 859మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికి మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 43మంది ఇన్విజిలేటర్లు, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఒక ఫ్లయింగ్ స్కాడ్, ముగ్గురు సిట్టింగ్ స్వాడ్స్, ముగ్గురు ఏఎన్ఎంలను నియమించారు. అలాగే సీసీవో ఇద్దరు, డీఆర్డీసీ సభ్యులు ఇద్దరిని ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే ప్రాక్టికల్స్ పరీక్షలకు 225మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి 2:30నుంచి సాయంత్రం 5:30గంటల వరకు నిర్వహిస్తారని జరుగుతుందని ఇన్చార్జి డీఈవో ఇందిర తెలిపారు. నిర్ణిత సమయానికి గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థి వెంట తప్పనిసరి హాల్టిక్కెట్ను తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థుల ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.