అమీర్ పేట : అమీర్పేట్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా నవరాత్రి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ దేవాలయ కమిటీ నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆయన నివాసంలో కలిసి అమ్మవారి ప్రసాదంతో పాటు పత్రికను అందజేశారు.
అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి ఆధ్వర్యంలో దేవాలయ ఛైర్మన్ మల్లికార్జునప్ప, ఈవో ఆకుల నరేందర్తో పాటు సూపరింటెండెంట్ బేతి రంగారెడ్డిలు మంగళవారం ఉదయం మంత్రిని ఆయన నివాసంలో కలుసుకుని ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు నిమ్మ నరేందర్రెడ్డి తదితరులున్నారు.