ఎల్బీనగర్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి మార్నింగ్ వాకింగ్ ఆరంభించి 35 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కేక్ కట్ చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ తాను కార్పొరేటర్గా గెల్చిన మొదటిసారి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మార్నింగ్ కార్యాక్రమాన్ని చేపట్టానని, అది రెండు పర్యాయాలు కార్పొరేటర్గా, హూడా ఛైర్మన్గా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూ కొనసాగిస్తున్నామన్నారు.
ప్రజలకు చేరువగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసేందుకు మార్నింగ్ వాక్ ఉపయోగపడిందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్రెడ్డితో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు అనంతుల రాజారెడ్డి, తోట మహేష్యాదవ్తో పాటుగా డీఎస్ఆర్ టీం ప్రతినిధులు పాల్గొన్నారు.