గోల్నాక : థీమహి సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరానికి స్పందన లభించింది. ఆదివారం గోల్నాక తులసీనగర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వచ్ఛంద సంస్థలు స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు వంద మంది కంటి, దంత సంబంధిత వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ల జోల్లు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిలింద్ , శివకుమార్ , దిలీప్ , పవన్ , సతీష్ , శ్రీకాంత్ , సాయి, చంద్రశేఖర్ , అనిల్ , గీత, శ్రీనివాస్ రెడ్డి , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.