ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు మంజూరైన రూ. 2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి వరంలాంటిదన్నారు. ఎంతోమంది పేదలు అధునాతన వైద్యసేవలను పొంది సీఎం సహాయ నిధి ద్వారా చేయుతను అందుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తిలక్రావు, కవిత, నిర్మల, మధుసాగర్, చంద్రశేఖర్రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.