జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అసలైన అభివృద్ధి జరిగిందని.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. ఆదివారం యూసుఫ్గూడ డివిజన్లో పనులు పూర్తిచేసుకున్న పలు అభివృద్ది కార్యక్రమాలను కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటగిరిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకు పెద్దపీట వేసి జనరంజక పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.