మెహిదీపట్నం : కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేకపోయాం. అయితే ఈ ఏడాది కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ సారి సీఎం కేసీఆర్ తాత, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నవల్లనే ఉత్సవాల నిర్వహణకు అనుమతి లభించిందని ఓ బుడతడు ఆనందం వ్యక్తం చేశాడు.
అంతేకాదు థాంక్యూ కేసీఆర్ తాత అంటూ ప్రత్యేకంగా అలంకరించిన చిన్న కారులో బుజ్జి వినాయకుడి నిమజ్జనానికి ట్యాంక్బండ్కు తరలివెళ్లాడు. నాంపల్లి నియోజకవర్గం రెడ్హిల్స్ డివిజన్ పటేల్బాడకు చెందిన ఏడేండ్ల సీహెచ్. నిధిష్ నర్సింహా పటేల్ గౌడ్ తన కారును టీఆర్ఎస్ పార్టీ జెండాలతో అలంకరించి ఆదివారం తన బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేయడం కోసం తరలి వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.