చంపాపేట : ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పీఆర్టీయూ-టీఎస్ ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ ముద్రించిన 2022 డైరీ, క్యాలెండర్ను చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్ ధ్యానాంజనే స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న సమస్యలన్నీ ప్రభుతం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు. అంతే కాకుండా 317 జీఓను సవరించి అందులో నెలకొన్న పైమరీ సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
రాష్ట్రంలో 75వేల సభ్యత్వం కలిగి ఉన్న ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్, బాధ్యులు సత్తిరెడ్డి, ప్రతాప్రెడ్డి, కృష్ణారెడ్డి, రాంభూపాల్రెడ్డి, ఎంఈవో రామాంజన్రెడ్డి, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.