మైలార్దేవ్పల్లి : రోలర్ స్కేటింగ్లో చిన్నారులు మంచి ప్రతిభ కనపరచడం అభినందనీయమని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో రోలర్ స్కేటింగ్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను వారి తల్లిదండ్రులను అభినందించారు.
గత రెండురోజులుగా ఇందిరా పార్కు, నాగోల్ లో జరిగిన రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రోలర్ స్కేటింగ్, రోడ్ షోలలో మైలార్దేవ్పల్లి డివిజన్కి చెందిన చిన్నారులు మంచి ప్రతిభ కనబరచడంతో పాటు అండర్ 7-9 విభాగంలో వై పితానీ, లాస్యాలు, 9-11 విభాగంలో జీ ఆరాధ్య, రిత్విక్ రెడ్డి, 11-14 విభాగంలో జీ మంజరీ, 14-17 విభాగంలో నితీన్ లు జిల్లా నుండి తెలంగాణ స్టేట్కు సెలెక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా ఎస్ ఎస్ స్కేటింగ్ ఆకాడమీ మాస్టర్ శంకర్ ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్టేట్ లెవల్కు ఆడడానికి శిక్షణ నివ్వడంలో శంకర్ కృషి చాల ఉన్నదని అన్నారు. మైలార్దేవ్పల్లి మినీ ఇండోర్ స్టేడియంలో జాతీయ అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు వీలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.
స్కేటింగ్ గ్రౌండ్ చిన్నగా ఉండడంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,ఈ విషయం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తొందరలోనే స్కేటింగ్ గ్రౌండ్ విశాలంగా చేయడానికి అధికారులకు ప్రతిపాదనలు పంపానని తెలియజేశారు.
భవిష్యత్తులో చిన్నారులు క్రీడలలో ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా ప్రోత్సహించాలని చిన్నారుల తల్లిదండ్రులను కోరారు. క్రీడలతో పాటు విద్య చాల అవసరం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ మాస్టర్లు శంకర్ ,భాస్కర్ ,యోగేష్ చిన్నారుల తల్లిదండ్రులు సారంగి బుచ్చయ్య, రిషికుమార్ ,వవీన్ , పాటిల్ , సురేష్ తదితరులు ఉన్నారు.