కందుకూరు : విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని లేమూరు గ్రామం మీదుగా వెలుతూ విద్యార్థులను చూసి తన కాన్వాయ్ని ఆపి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి ఆటోగ్రాఫ్ను అడిగి తీసుకున్నారు.
విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఏ కష్టం వచ్చిన తాను ఆదుకుంటానని చెప్పారు. బాగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని సూచించారు.
అనంతరం కూరగాయాలు విక్రయిస్తున్న మహిళల వద్దకు వెళ్లి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
కో ఆప్షన్ మెంబరు కుటుంబాన్ని పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి
మండల పరిధిలోని అగర్మియగూడ గ్రామానికి చెందిన కో ఆప్షన్ సభ్యులు లిక్కి జంగారెడ్డి తల్లి ముత్యాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె గ్రామానికి వచ్చి జంగారెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.
మంత్రి వెంట జడ్పీటీసీ జంగారెడ్డి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ మండల పార్టీ ఉపాధ్యక్షులు వడ్డెపల్లి రేవంత్రెడ్డి, లక్ష్మీనర్సింహరెడ్డి , సదానంద్గౌడ్, బుచ్చిరెడ్డి, వెంకట్రెడ్డి లు పాల్గొన్నారు.