బండ్లగూడ: మీరాలం ట్యాంకు ప్రాంతాన్ని స్పెషల్ సీఎస్ అరవింద్కుమార్, హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అద్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సందర్శించారు. మీరాలం ట్యాంకు ప్రాంతంలో సుందరీకరణ, వాకింగ్ ట్రాక్లతో పాటు పలు అభివృద్ది పనులను చేపట్టాలని నిర్ణయించిన క్రమంలో వారు ట్యాంకును సందర్శించారు. మీరాలం బండ్ తో పాటు సమీపంలో చేపట్టనున్న పనులను వారు పరిశీలించి చర్చించారు.
ఈ సందర్భంగా అభివృద్ది పనులను గురించి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, స్పెషల్ సీఎస్ కు అధికారులు వివరించారు. మీరాలం ట్యాంకు సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్లతో పాటు సందర్శకులను ఆకట్టుకునేందుకు వీలుగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. వాటిని ఎంపీ అసదుద్దీన్తో చర్చించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్,డీసీ జగన్ తదితరులు పాల్గొన్నారు.