జూబ్లీహిల్స్ : వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకుని గురువారం ఎర్రగడ్డలోని శ్రీవిజయలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు ఉత్తర ద్వార దర్శనంతో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య పీఠం ఆధ్వర్యంలో జనవరి 14 వరకు ఈ ఆలయంలో 28 వ ధనుర్మాస మహోత్సవాలు జరుగుతున్నాయి.