మారేడ్పల్లి : మోండా డివిజన్ మారేడ్పల్లిలోని ఎల్శంకర్నగర్, అల్లాడిపెంటయ్య బస్తీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. ఎల్ శంకర్నగర్ బస్తీలో దీర్ఘాకాలికంగా డైనేజీ సమస్య ఉండడంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకెళ్లడడంతో..వెంటనే జలమండలి జీఎం రమణారెడ్డి, డీజీఎం కృష్ణ, సిబ్బందితో కలిసి పర్యటించారు.
స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు బస్తీ వాసులు వివరించారు. డైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవా లని, వెంటనే నూతన పైప్లైన్ ఏర్పాట్లుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని జలమండలి అధికారులను ఎమ్మెల్యే సాయన్న ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…బస్తీ, కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ..వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మారేడ్పల్లి లోని ఎల్శం కర్నగర్, అల్లాడిపెంటయ్యనగర్ బస్తీలో డైనేజీ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, టిఎన్. శ్రీనివాస్, సదానంద్గౌడ్, ఆకుల హరి, పిట్ల నాగేష్, తదితరులు పాల్గొన్నారు.