చిక్కడపల్లి :పారిశుద్ధ్య కార్మికులకు భత్రత లేకపోతే శుభత్ర లేదని, ప్రతి కార్మికుడు భధ్రత పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో జలమండలి భద్రత పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ మ్యాన్హోల్స్లో వ్యర్థాలు వేయ్య కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వ్యర్థాలు వేయ్యడంతో మురుగు నీరు ఉప్పొంగి రహదారులపైకి వస్తుందని వివరించారు. దీని వలన దోమలు పేరిగి రోగాల భారీనపడాల్సి వస్తోందని తెలిపారు. ప్రజల కోసం నిరంతనం శ్రమిస్తున్న కార్మికులకు సహకరించాలని సూచించారు.
సీజీఎం ఆనంద్ నాయక్ మాట్లాడుతూ మురుగునీటి వ్యవస్థలు పూడుకుపోకుండా నిత్యం వాడే షాంపూ ప్యాకెట్స్, ప్లాసిక్ వ్యర్థాలు, ఆహార పదార్థ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు మ్యాన్ హోల్స్లో వేయరాదని ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటికి స్టీల్ చాంబర్స్ నిర్మించుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులపై భద్రతపై శ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం వహించ వద్దు అని అన్నారు. మ్యాన్ హోల్స్ నిర్వహణలో మనుషులను నివారిద్దామని, యంత్రాలతో పనిచేయిద్దాం అని కార్మికులు సూచించారు. ఈ సందర్భంగా కార్మికులచే విధి నిర్వాహణలో భద్రత పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా ర్యాలీ నిర్వహించారు.
జీఎం సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాంనగర్, ముషీరాబాద్ కార్పొరేటర్లు రవి చారి, సుప్రీయ నవీన్ గౌడ్, డీజీఎంలు చంద్రశేఖర్, వాహీద్, సన్యాసి రావు, సతీష్,బాగ్లింగంపల్లి మేనేజర్ జీవన్ జ్యోతి,వేణుగోపాల్ నాయకుడు తదితరలు పాల్గొన్నారు.