ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తమకు ఎటువంటి లిఖిత పూర్వక ఉత్తర్వులు లేకుండా బదిలీలు చేశారని మంత్రికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాము పనిచేస్తు న్న కళాశాలల ప్రిన్సిపళ్లు తమను ఇతర కళాశాలలకు బదిలీ చేస్తున్నట్లు మౌఖికంగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీ చేయాలంటే దానికి సంబంధించి రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.
కానీ ఒక కళాశాల ప్రిన్సిపల్ మరో కళాశాలకు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. తాము రిజిస్ట్రార్ బదిలీ చేస్తే ఎక్కడికైనా వెళ్లి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించి న మంత్రి స్పందిస్తూ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సంఘాల ప్రతినిధులు డాక్టర్ పరుశురాం, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ వి. కుమార్, డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.