అంబర్పేట : బాగ్అంబర్పేట డివిజన్లోని పోచమ్మబస్తీలో రూ.14.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. అనంత రం ఆయన ప్రభుత్వ స్కూల్లేన్, వాంబే కాలనీ ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక బస్తీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కరెంటు స్తంభాలకు ఉన్న బాక్సులకు డోర్ లేకపోవడంతో షాక్ కొట్టే ప్రమాదం ఉందని, వాటికి మూతలు ఏర్పాటు చేయించాలని చెప్పారు. మంచి నీటి సరఫరా సరిగ్గా రావడం లేదన్నారు. డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుందని చెప్పారు.
స్పందించిన ఎమ్మెల్యే ఈ నెల 11న అన్ని విభాగాల అధికారులతో కలిసి మళ్లీ బస్తీకి వస్తానని, అప్పుడు వారికి సమస్య లను వివరించాలని, వెంటనే తగిన ప్రతిపాదనలు రూపొందించి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, శ్రీరాములుముదిరాజ్, దిలీప్, అరుణ్రెడ్డి, మిర్యాల రవి, మహేష్, దారయోబు, స్వామి, రాజేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, స్వర్ణ, బీజేపీ నాయకులు చుక్క జగన్, కోడూరి సురేష్, ఇ.రఘునందన్, ఎం.శ్రీనివాస్, కె.శ్రీహరి, అచ్చిని మహేష్, డి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.