జూబ్లీహిల్స్ : రహ్మత్నగర్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న మీరా భాయ్ అనే వృద్దురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.20వేల చెక్కును మంగళవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.