మియాపూర్ : కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగు తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి బుధవారం ఆయన స్థానిక కార్పొరేటర్లతో కలిసి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 137 మంది లబ్ధిదారులకు రూ. 1,37,15,892 ల చెక్కులను అందజేసి నట్లు తెలిపారు.
పేదింటి ఆడపడుచుల పెండ్లిళ్లకు ఇబ్బందులు పడకూడదనే పెద్ద మనస్సుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారీ సమయంలో చెక్కులను వెంటనే అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్, జగదీశ్వర్గౌడ్, వెంకటేశ్గౌడ్, శ్రీనివాసరావు, శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్గౌడ్, మంజుల రఘునాథరెడ్డి, రోజాదేవి రంగారావు తదితరులు పాల్గొన్నారు.