బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత అదృశ్యమయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్కు చెందిన కే.రాము కంచర్ణ వివాహం ప్రసన్న(25) తో 2013లో జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు.
కాగా ఆర్మీలో పనిచేసే రాము భార్యాపిల్లలను సమీపంలో ఉంటున్న ప్రసన్న తల్లి ఇంట్లో ఉంచి డ్యూటీకి వెళ్లిపోయాడు. కాగా సెప్టెంబర్ 24న సెలవులో ఇంటికి వచ్చిన రాము తన భార్య ప్రవర్తనలో మార్పును గుర్తించాడు. ఈ విషయాన్ని ప్రసన్న తల్లికి చెప్పగా ఆమె కూడా ప్రవర్తన మార్చుకోవాలని కూతురుకు హితవు పలికింది.
ఇదిలా ఉండగా గత నెల 31న రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ప్రసన్న ఇంట్లోంచి వెళ్లిపోయింది. అన్ని ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోవడంతో భర్త రాము సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.