కందుకూరు : మండల పరిధిలోని సాయిరెడ్డిగూడలో చిరత సంచారం కలకలం రేపింది. ఆవు దూడపై దాడి చేయడంతో దూడ మరణించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నానక్నగర్ గ్రామ సమీపంలోనూ చిరుత మేక పిల్లపై దాడి చేసింది.
ఈ సంఘటన మరువక ముందే సాయిరెడ్డి గూడ గ్రామంలో లేగ దూడపై దాడి చేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చెరుకుని పరిశీలించారు.