చిక్కడపల్లి : స్వాతంత్య్ర సమర యోధుడు,మూడు తరాల తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పద్మశాలి ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్యక్రమాన్ని ఆశోక్నగర్ బాపూజీ విగ్రహం వద్ద నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన మహనీయుడు బాపూజీ అన్నారు.
నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రామూర్తి, కార్పొరేటర్లు పావని వినయ్కుమార్, సుప్రియ, సునీత, రచన శ్రీ , టీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు, తెలంగాణ ట్రిబ్యూనల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకుడు వి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరై నివాళులు అర్పించారు.