కవాడిగూడ : శరన్నవరాత్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్లలోని ప్రధాన ఆలయాలైన శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం, భోలక్పూర్ డివిజన్ పరిధిలోని శ్రీ మహంకాళీ దేవాలయంలో శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణలో దుర్గామాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహంకాళీ దేవాలయంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు.
అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9-30 గంటల వరకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకాల కట్టమై సమ్మ దేవాలయం వ్యవస్థాపక చైర్మన్ జి. గౌతంకుమార్ పటేల్, ఈఓ కే. సాంబశివరావు, శ్రీ మహంకాళీ దేవాలయం చైర్మన్ ఎయిర్టెల్ రాజు, పూజారీ వై. చంద్రమౌళి, ముచ్చకుర్తి ప్రభాకర్, రెబ్బ రామారావు తదితరులు పాల్గొన్నారు.