మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్రామ వార్డు సభ్యులు బ్యాగరి రాజు పలువురు బీజేపి, కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫథకాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందుతు న్నాయని ఆమె అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి పార్టీ ఎపుడు సముచిత స్తానం కల్పిస్తుందని ఆమె అన్నారు.
ప్రతి ఒక్కరు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు అంగోతు రాజునాయక్, మాజీ అద్యక్షులు హనుమగల్ల చంద్రయ్య, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, నాయకులు పెంటల రాయప్ప, మద్ది కరుణాకర్రెడ్డి, ఉపసర్పంచ్ పోతుల నర్సింగ్పటేల్, గ్రామశాఖ అద్యక్షులు పెంటల వెంకటేశం, డైరెక్టర్ ఆవుల పెద్ద నర్సింహ్మ పాల్గొన్నారు.
కాగా దేవానందం గౌడ్, మల్లేష్, మచ్ఛేంధర్, అశోక్, మహేష్, చంద్రమోహన్, రవి, రాములు, కప్పరి మహేందర్, ఎరరాజు, బ్యాగరి నర్సింహ్మ, తొంట భూపాల్, నల్లబాల్రాజ్, ఎరశేఖర్, బ్యాగరికృష్ణ, మంచినీళ్ల జగన్ తదితరులు పార్టీలో చేరారు.