చిక్కడపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ నేతాజీనగర్కు చెందిన బీజేపీ నాయకుడు డీకే శ్రీనివాస్తో పాటు మరో 50మంది ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.
కాంగ్రెస్ నాయకులు మోహన్, శంకర్, ఏకేదాస్తో పాటు మరో 30 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచా యన్నారు. నియోజవకర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా నరేశ్, నాయకుడు ముఠా నరేశ్, యువజన నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మారిశెట్టి నర్సింగ్ రావు, ఆకుల శ్రీనివాస్, గడ్డమీది శ్రీనివాస్, హన్మంతు, విఠల్, టి.యాదగిరి, బి.కిరణ్ కుమార్, రాజ్కుమార్, మల్యాల సురేశ్, తుడం లక్ష్మి, సుధా, తదితరులు పాల్గొన్నారు.