మాదాపూర్ : పార్టీపట్ల అంకితభావం కలిగిన వ్యక్తిని కొల్పొయామని, జయరాజ్ మరణం నియోజకవర్గం ప్రజలకు తీరని లోటని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల జయరాజ్ యాదవ్ ప్రథమ వర్థంతిని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ గ్రామంలో బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శెరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా జయరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయరాజు మరణం పార్టీకి తీరనిలోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.