బండ్లగూడ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గుర్తుంపునిచ్చిందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రామ పిరం చెరువులో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితరెడ్డిలతో కలిసి చేపలను వదిలారు.ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పడినప్పటి నుంచి కుల వృత్తుల వారికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తూ వారి అభివృద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
తెలంగాణలో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడిక తీత పనులు చేపట్టి చెరువులు కుంటలు నిండుకునేల చర్యలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులు చేపలను పట్టుకుని వారి జీవనం సాగించేందుకు గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం 208 కోట్ల రూపాయలతో చెరువుల్లో చేపలను ఉచితంగా వదిలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. తద్వారా మత్సకారులకు 30 వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
ఈ సంవత్సరం కూడ 89 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వం రొయ్యల పెంపకంను కూడ పోత్సహిస్తుందని తెలిపారు. చేపలను అమ్ముకునేందుకు జీహెచ్ఎంసీ ప్రాంతాలలో మొబైల్ వాన్ల ద్వారా చేపల విక్రయాన్ని ప్రోత్సహిస్తున్నదని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్లే నేడు చెరువులు,కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, బీజేఎంసీ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి,మేనేజర్ మనోహర్, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్గౌడ్,యువజన అధ్యక్షుడు మల్లేష్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.