కందుకూరు : రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఆదివారం మండల పరిధిలోని గూడూరు సర్పంచ్ భర్త శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు, డైరెక్టరు నర్సింహ, అగర్మియగూడ ఉప సర్పంచ్ ఆదీబ్, బాచుపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బాలమల్లేష్, తుక్కుగూడ మున్సిపాలిటి వైఎస్ చైర్మన్ భవాణి వెంకట్రెడ్డి మంత్రిని ఆదివారం కలిసి గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాలు అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామాలకు ప్రతి నెల పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
అభివృద్ధి చేస్తుంటే ప్రతి పక్షాల నాయకులు అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని కోరారు. ఎవ్వరెన్ని విమర్శలు చేసిన అభివృద్ధి మాత్రము ఆగదని చెప్పారు.