ఎల్.బీ నగర్ : నియోజకవర్గం పరిధిలోని శివారు ప్రాంత కాలనీల్లో మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
శనివారం హయత్నగర్ డివిజన్లోని పరమేశ్వర కాలనీకి మంచినీరు, డైనేజీ పైపులైన్లు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పరమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పరమేశ్గౌడ్ మాట్లాడుతూ కాలనీలో పార్కు స్థలానికి ప్రహారీ నిర్మించి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యేను కోరినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకు రాలు సింగిరెడ్డి మల్లీశ్వరిరెడ్డి, కాలనీవాసులు జానేష్, శ్రీనివాస్, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు .