సైదాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం సైదాబాద్ సింగరేణికాలనీలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో తాను మొక్కలను నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. దేశం పచ్చగా ఉండాలంటే వర్షాలు బాగా కురవాలన్నా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.