సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య భద్రతకు భరోసా నిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందన్నారు.
సోమవారం కార్కానాలోని తన క్యాంపు కార్యాలయంలో మూడో వార్డు సిఖ్ విలేజ్కు చెందిన నీల మోహన్రావు వైద్యం కోసం రూ.1.50లక్షల విలువ చేసే ఎల్వోసీని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో మోహన్రావు ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సాయన్నను సంప్రదించగా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.1.50లక్షల విలువ గల ఎల్వోసీని లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, నేతలు సదానంద్గౌడ్, తేజ్పాల్, భాస్కర్ముదిరాజ్, రామ్మోహన్, సంతోష్, మురళీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.