మియాపూర్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారిని అన్ని సందర్భాలలో ఆదు కునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భరోసాగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి సంజీవనిలా ఉపయోగపడుతున్న దన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్ ఆర్టీసీ కాలనీకి చెందిన కృష్ణంరాజు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ . 2 లక్షల నిధులు మంజూరయ్యాయి.
ఆ పత్రాలను విప్ గాంధీ బుధవారం తన నివాసంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధితో నియోజకవర్గంలో వందలాది మంది బాధిత ప్రజలు మెరుగైన వైద్య సేవలతో తమ ఆరోగ్యాలకు స్వస్థత కల్పించుకున్నారన్నారు.
నిరంతర సేవలతో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని విప్ గాంధీ అన్నారు. పథకం దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా సహాయం లభించేలా తాను అధికారులతో ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్లు గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిక్ శ్రీను, పద్మారావు పాల్గొన్నారు.