మన్సూరాబాద్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపు తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ నాగోల్ ఓల్డ్ విలేజ్కు చెందిన కట్ట ఈశ్వరయ్య గౌడ్ ఆరోగ్య సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు.
చికిత్స ఖర్చును భరించలేని స్థితిలో ఉన్న ఈశ్వరయ్య గౌడ్ విషయాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి దృష్టికి తీసు కెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సీఎం సహాయనిధి ద్వార రూ. 1 లక్ష చెక్కును మంజూరు చేయించా రు. మంజూరైన సదరు చెక్కును బుధవారం తన కార్యాలయంలో బాధితుడు కట్టా ఈశ్వరయ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వేలాధి కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.. పేదలకు వరం లాంటి సీఎం సహాయనిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సీఎం సహాయనిధి నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ప్రజలకు సంజీవిని లాగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు ప్రశాంత్ గౌడ్, డేరంగుల కృష్ణతదితరులు పాల్గొన్నారు.