మన్సూరాబాద్ : ప్రజల భద్రత కోసం కాలనీ సంక్షేమ సంఘాలు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సోమవారం ఆయన కాలనీ సంక్షేమ సంఘం ప్రతనిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు ఉన్న కాలనీలలో నేరాలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరం ఉందని.. కాలనీలలో వీటిని ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీఐ అశోక్రెడ్డి, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీష్యాదవ్, నాయకులు జక్కిడి రఘువీర్రెడ్డి, నరి వెంకన్న కురుమ, రుద్ర యాదగిరి, టి. మోహన్రెడ్డి, నరి అంజయ్య, కంచర్ల రాకేష్రెడ్డి, విజయ భాస్కర్రెడ్డి, చెంగల్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.