ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తార్నాక డివిజన్ లో నిరసనలు ఎగిసిపడ్డాయి. నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
మోడీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. లాలాపేట నుంచి తార్నాక వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ, తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఎన్నో బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టీఆర్ ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో…
టీఆర్ ఎస్ యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆలకుంట హరి ఆధ్వర్యంలో ఓల్డ్ డెయిరీ ఫామ్ రోడ్డు చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆలకుంట హరి మాట్లాడుతూ ప్రధాని మోడీ వైఖరిపై మండిపడ్డారు.