యైటింక్లయిన్కాలనీ, సెప్టెంబర్ 16 : ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి గనిలో కంటిన్యూయస్ మైనర్ ఏర్పాటుతో గని జీవిత కాలం మరో 8 ఏండ్లు పెరుగనుందని జీఎం టీ వెంకటేశ్వర్రావు తెలిపారు. గనిలోకి కంటిన్యూస్ మైనర్ దించుతున్న సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. సుమారు రూ.80కోట్లతో అధునాతన టెక్నాలజీతో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ముందుగా షటిల్కార్, ఫీడర్ బ్రేకర్, లోడ్ సెంటర్ను గనిలోకి దించి యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ యంత్రంతో దాదాపు 300 మీటర్ల లోతులో ఉన్న బొగ్గు నిల్వలను త్వరితగతిన ఉత్పత్తి చేయవచ్చునని వివరించారు. ఈ నెల 25వ తేదీలోగా గనిలో ఈ యంత్రాన్ని పూర్తి స్థాయిలో ఎరక్షన్ చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యంత్రం గనిలోకి ప్రవేశపెట్టడం ఎంతో శుభశుచకమని, తద్వారా మొదటగా 600 టన్నుల బొగ్గు ఉత్పత్తితో ప్రారంభమై 1500 టన్నులు సాధించే వీలు ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం సందనాల సాంబయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఏరియా ఇంజినీర్ రాధాకృష్ణారావు, గని ఏజెంట్ కాంరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఏరియా సేఫ్టీ అధికారి జీఎల్ ప్రసాద్, గని మేనేజర్ రవికిరణ్, గ్రూప్ ఇంజినీర్ పైడీశ్వర్, డీజీఎం(ప) ప్రదీప్కుమార్, సంక్షేమాధికారి ఓంకారిబాబు, పిట్ సెక్రటరీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.