బడంగ్పేట : రాష్ట్ర వ్యాప్తంగా 1.8 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం కోసం రూ.318 కోట్లు ఖర్చు చేసినట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మహిళా కార్పొరేటర్స్ బతుకమ్మ ఆడారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ రోజు బతుకమ్మ పండుగ గిన్నీస్ బుక్ లో నమోదు అయ్యిందంటే దానికి కారణం రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత అన్నారు. ప్రతి ఏటా మహిళలకు ఇస్తున్న చీరల వెనుక నేతన్నల కష్ట ఫలితం ఉందన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు రూపు మాపడానికి ఆరు నెలలు నేతన్నలకు ప్రభుత్వం పనికల్పిస్తుందన్నారు. పది వేల మంది నేత కార్మికులు 16వేల మగ్గాలపై బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారని ఆమె అన్నారు.
18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలను ఇవ్వడం జరుగుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా చీరల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అన్ని పండుగలను గౌరవిస్తు ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు. అన్ని మతాల వారికి వారి పండుగల సందర్భంగా దుస్తులు పంపిణీ చేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడ ఇలాంటి పథకాలు లేవన్నారు. దేశం గర్వించే విధంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకా లను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. మహిళల కోసం ఎన్పో ఉపాధి పథకాలు తీసుక రావడం జరిగిందన్నారు.
బతుకమ్మ పండగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అంటే అందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కారణం అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, కమిషనర్ క్రిష్ణమోహన్రెడ్డి, లిక్కి మమత క్రిష్ణా రెడ్డి, రాళ్ళ గూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, రోహిణి రమేష్, రమాదేవి శ్రీనివాస్, బీమిడి స్వప్న జంగారెడ్డి, సూర్ణ గంటి అర్జున్ పెద్ద బావి శ్రీనివాసరెడ్డి, పెద్ద బావి సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, సంరెడ్డి వెంకట్రెడ్డి, పెద్ద బావి ఆనంద్ రెడ్డి, పుట్టగల్ల సంతోష్ కుమార్, కరె బల్వంత్, అధికారులు చంద్రశేఖర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, యాదగిరి ఉన్నారు.