బీబీనగర్, సెప్టెంబర్ 18 : అర్హులంతా కరోనా టీకాలు వేయించుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సూచించారు. శనివారం మండలంలోని గూడూరులో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే మండలంలోని కొండమడుగు, గూడూరులో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి టీకా పంపిణీని పరిశీలించారు. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, ఎంపీడీఓ శ్రీవాణి, వైద్యాధికారులు డాక్టర్ దాక్షాయని, డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నూరు శాతం పూర్తిచేయాలి
బొమ్మలరామారం : అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండలంలో నూరు శాతం కొవిడ్ వాక్సినేషన్ ప్రకియను పూర్తిచేయాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. శనివారం మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు పెద్దపర్వతాపూర్, తిరుమలగిరిలో కరోనా టీకాల పంపిణీని పరిశీలించారు. గ్రామాల్లో తిరిగి యువకులు, ప్రజలను కలిసి టీకా తీసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, తిరుమలగిరి సర్పంచ్ నునావత్ అశోక్నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు బానోతు సుధాకర్, మండల అధికార ప్రతినిధి వరిగంటి సతీశ్గౌడ్, నవీన్గౌడ్ పాల్గొన్నారు.
కేంద్రాల పరిశీలన
భువనగిరి అర్బన్/చౌటుప్పల్ : భువనగిరిలోని 9, 10, 11, 12, 13 వార్డుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు శనివారం పరిశీలించారు. టీకా నమోదును పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ పూర్ణచందర్, కౌన్సిలర్లు నల్లమాస సుమావెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్కుమార్, జిట్టా వేణుగోపాల్రెడ్డి, ఊదరి లక్ష్మీసతీశ్, జనగాం కవితానర్సింహాచారి, రిసోర్స్ పర్సన్లు, నాయకులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెం 3వ వార్డులో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బండమీది మల్లేశం పాల్గొన్నారు.
536మందికి టీకాలు..
మోటకొండూర్ : మండల కేంద్రంలోని పీహెచ్సీతోపాటు వర్టూర్, ఇక్కుర్తి, ముత్తిరెడ్డిగూడెం, నాంచారిపేట గ్రామాల్లో 430 మందికి మొదటి డోసు, 101మందికి రెండో డోసు టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ దేవావర, హెచ్ఈఓ ప్రవీణ్కుమార్, వైద్య సిబ్బంది శ్యామ్సుందర్, కృష్ణారెడ్డి, యాకయ్య, అంజయ్య, మహేశ్, సునంద, వసంత, గీత, ఏఎన్ఎంలు ధనమ్మ, విజయరాణి, అరుణ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల వ్యాప్తంగా 18ఏండ్లు నిండిన యువతీ యువకులు కరోనా టీకా వేయించుకోవాలని మండల వైద్యాధికారి ప్రణీష, ఎంపీడీఓ రాములు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను పరిశీలించారు.