పాకాల వేదికగా నదుల ఏకం
సాగు నీటి రంగంలో అద్భుత ఘట్టం
అడ్డంకులన్నిటినీ అధిగమించిన ‘దేవాదుల’
‘రామప్ప- రంగాయ’ ద్వారా నీటి తరలింపు
దబ్బవాగులో నుంచి నేడు పాకాలకు గోదావరి జలాలు
వరంగల్రూరల్, ఏప్రిల్ 7(నమస్తేతెలంగాణ) : ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంలో అనేక అద్భుతాలు సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో మరో మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. చారిత్రక పాకాల సరస్సు వేదికగా గోదావరి, కృష్ణా బేసిన్లు ఏకమయ్యే సమయం ఆసన్నమైంది. అడ్డంకులన్నింటినీ అధిగమించి గోదావరి జలాలు గమ్యాన్ని ముద్దాడనున్నాయి. రామప్ప రిజర్వాయర్ నుంచి గోదావరి నీరు గురువారం పాకాల సరస్సులోకి అడుగిడనుంది. నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో సుమారు 70వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మా ణం చేపట్టింది. వీటిలో మొదటిది రామ ప్ప- రంగాయచెరువు (ప్యాకేజీ-5) ప్రా జెక్టు కాగా, రెండోది రామప్ప- పాకాల ప్రాజెక్టు. జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడోదశలో భాగంగా ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వీటితో నర్సంపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పట్టుదలతో ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రామప్ప- రంగా య ప్రాజెక్టు పనులు పూర్తికావొచ్చా యి.
ఈ ప్రాజెక్టులోని ఒక మోటరు ద్వారా గత యాసంగిలో ట్రయల్న్ చేశారు. జలవనరుల శాఖ ఇంజినీర్లు ప్రస్తుత యాసంగిలో రెండో మోటరు ట్రయల్న్ కూడా నిర్వహించారు. రెండు మోటర్లతో రామ ప్ప రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేస్తున్నారు. ఎత్తిపోతలతో పైపులైన్ ద్వారా రామప్ప రిజర్వాయర్ నుం చి గోదావరి నీరు నల్లబెల్లి మండలం గోవిందాపురం శివారులోని రంగాయచెరువులోకి చేరుతున్నది. కొద్దిరోజులుగా రంగాయచెరువు నుంచి పాకాల వాగు ద్వారా నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులోకి నీరు వస్తున్నది. రామప్ప- పాకాల పనులు కూడా తుది దశకు చేరాయి. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి రామప్ప నుంచి పాకాల సరస్సులోకి గోదావరి జలాలను తరలించే ఏర్పాట్లలో జల వనరుల శాఖ ఇంజినీర్లు తలమునకలయ్యారు.
ప్రత్యామ్నాయంగా రంగాయచెరువు..
దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మూడోదశలో రామప్ప చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మారింది. కన్నాయిగూ డెం మండలంలోని గంగారం వద్ద నిర్మించిన దేవాదుల ఇన్ టేక్వెల్ నుంచి ఎత్తిపోతలతో గోదావరి నీరు భీంగణపురం రిజర్వాయర్ ద్వారా రామప్పకు చేరుతుంది. రామప్ప- రం గాయ, రామప్ప- పాకాల ప్రాజెక్టులకు రామప్ప నుంచే గోదావరి జలాలను తరలించేందుకు ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని రంగారావుపల్లి వద్ద వేర్వేరుగా రెండు పంపుహౌస్లు నిర్మించారు. ప్రతి పంపుహౌస్లో రెండేసి మోటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రామప్ప- రంగాయ ప్రాజెక్టు పంపుహౌస్లోని రెండు మోటర్ల ట్రయల్న్ సక్సెస్ కావడంతో రంగాయచెరువులోకి పంపింగ్ నడుస్తున్నది. రామప్ప- పాకాల పూర్తయితే రామప్ప నుంచి నేరుగా గోదావరి నీరు పాకాల సరస్సులోకి చేరనుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రామప్ప- రంగాయచెరువు ప్రాజెక్టును డిజైన్ చేశారు. రామప్ప- రంగాయ ప్రాజెక్టు పైపులైన్ నల్లబెల్లి మండలంలోని గొల్లపల్లి వరకు నిర్మించారు. గొల్లపల్లి సమీపంలో దబ్బవాగు ఉండగా రామప్ప- రంగాయ ప్రాజెక్టు నీటిని గొల్లపల్లి వద్ద పైపులైన్ నుంచి దబ్బవాగులోకి వదిలితే నేరుగా పాకాల సరస్సులోకి చేరనుంది. రామప్ప- పాకాల ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా పాకాల కింద పంటలకు ప్రస్తుత యాసంగికి నీరిచ్చేలా ఎమ్మెల్యే పెద్ది సూచనతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సోమవారం నుంచి భీంగణపురం రిజర్వాయర్ ద్వారా గోదావరి నీటిని రామప్ప రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఇంజినీర్లతో కలిసి అవుట్ఫాల్ ద్వారా రామప్ప రిజర్వాయర్లోకి చేరుతున్న నీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఏకం కానున్న రెండు నదులు..
వరంగల్రూరల్ జిల్లాలో గోదావరి, కృష్ణా బేసిన్లున్నాయి. జిల్లా మధ్యలో ఉన్న గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల నుంచి నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండతో పాటు ఇతర మండలాలు కృష్ణా బేసిన్లోనివి. ఆత్మకూరు, దామెర, శాయంపేట, పరకాల, నడికూడతో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలు పూర్తిగా గోదావరి బేసిన్లో ఉంటాయి. రామప్ప రిజర్వాయర్ కూడా గోదావరి బేసిన్లోనే ఉన్నది. రామప్ప- రంగాయ, రామప్ప- పాకాల ఆయకట్టు పూర్తిగా కృష్ణా బేసిన్లోకి వస్తుంది. ఇప్పటికే రామప్ప నుంచి గోదావరి నీరు రంగాయచెరువు, మాదన్నపేట చెరువుల్లోకి చేరుతుంది. గురువారం నుంచి దబ్బవాగు ద్వారా పాకాల సరస్సులోకి చేరనుంది. పాకాల నుంచి మున్నేరు వాగు ప్రారంభమవుతుంది. ఇది ఆకేరు వాగులో కలుస్తుంది. చివరకు ఆకేరు వాగు నీరు కృష్ణా నదిలోకి చేరుతుంది. పాకాలపై భాగాన ఉన్న గ్రామాల చెరువుల మత్తడి నీరు పూర్తిగా మున్నే రు ద్వారా కృష్ణా నదిలోకి వెళ్తుంది. మున్నేరు వాగు ప్రారంభమయ్యే పాకాల సరస్సులోకి నేడు గోదావరి జలాలు తరలనున్నాయి. దేవాదుల పరిధిలో ఇప్పటి వరకు గోదావరి నీరు కృ ష్ణా బేసిన్కు చేరేది ఇదే మొదటిది కావడం విశేషం. రెండు నదులను ఏకం చేస్తున్న సరస్సుగా పాకాల చరిత్రలో నిలిచిపోనుంది.
ఇవి కూడా చదవండి..
కుంభ సందేశ్ యాత్ర స్ఫూర్తిని ప్రశంసించిన ఆరెస్సెస్ ఛీఫ్
కొవిడ్ విజృంభణ : చత్తీస్ఘడ్ రాజధానిలో సంపూర్ణ లాక్డౌన్